అఖిలపక్ష పార్టీలతో  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశం

అఖిలపక్ష పార్టీలతో  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశం

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష పార్టీలతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశం కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ సెషన్స్ సజావుగా సాగడంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయపార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరవుతారు. ఇదిలా ఉండగా సోమవారం (జనవరి 31) సాయంత్రం 5 గంటలకు, రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ఎజెండాను రూపొందించడానికి సభలోని వివిధ పార్టీలు మరియు గ్రూపుల నాయకులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, సెషన్‌ ఎజెండాపై చర్చించేందుకు రాజ్యసభ ఛైర్మన్‌ ప్రతి పార్లమెంట్‌ సమావేశాలకు ముందుగా వివిధ పార్టీలు, గ్రూపుల నేతలతో సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 ఉదయం 11:00 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు.కరోనా దృష్ట్యా ఈసారి పేపర్‌లెస్ బడ్జెట్‌గా ఉంటుంది.