న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. వెన్ను సర్జరీ నుంచి కోలుకుంటున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆగస్ట్లో ఐర్లాండ్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో అతను బరిలోకి దిగే చాన్స్ ఉంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిలిటేషన్లో ఉన్న బుమ్రా క్రమంగా బౌలింగ్ వర్క్లోడ్ పెంచుకుంటున్నాడు. ఇప్పటి వరకు 70 శాతం ఫిట్నెస్ సాధించినట్లుగా తెలుస్తోంది.
ఐర్లాండ్ టూర్కు మరో రెండు నెలల టైమ్ ఉండటంతో ఆలోగా పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. అయితే డైరెక్ట్గా వన్డేల్లో ఆడకుండా ముందుగా టీ20ల్లో బౌలింగ్లో చేసి ఫిట్నెస్ లెవెల్స్ను పరీక్షించుకోవాలని బుమ్రా భావిస్తున్నాడు. ఇందులో సక్సెస్ అయితే సెప్టెంబర్లో శ్రీలంకలో జరిగే ఆసియా కప్లో బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీలోనూ రాణిస్తే వన్డే వరల్డ్కప్లో ఆడేందుకు బుమ్రాకు లైన్ క్లియర్ అవుతుంది. ఇక కేఎల్ రాహుల్ కూడా ఆసియా కప్పై దృష్టి పెట్టాడు. వెన్ను నొప్పికి సర్జరీ చేయించుకున్న మరో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఆసియా కప్లో ఆడే చాన్స్ కనిపించడం లేదు.