- అమ్మవారి ముక్కుపుడక, హుండీలోని డబ్బు, బంగారం, వెండి నగలు ఎత్తుకెళ్లిన దొంగ
శామీర్ పేట, వెలుగు : అమ్మవారి ఆలయంలో బంగారం, వెండి నగలు చోరీకి గురైన ఘటన తుర్కపల్లిలోని జీనోం వ్యాలీ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి శామీర్ పేట మండలం తుర్కపల్లిలోని పెద్దమ్మ తల్లి ఆలయంలోకి వచ్చిన ఓ దొంగ..
అమ్మవారి ముక్కుపుడకతో పాటు హుండీలోని డబ్బు, బంగారం, వెండి నగలను ఎత్తుకెళ్లాడు. ఇదంతా ఆలయంలోని సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో మంగళవారం కమిటీ సభ్యులు పీఎస్ లో కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు పైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.