కేయూలో పల్లా దిష్టిబొమ్మ దహనం

కేయూలో పల్లా దిష్టిబొమ్మ దహనం

హసన్ పర్తి, వెలుగు: పీహెచ్​డీ అడ్మిషన్లలో అక్రమాలతో పాటు స్టూడెంట్లపై పోలీసుల దాడి తతంగమంతా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లోనే జరిగిందని కేయూ స్టూడెంట్ జేఏసీ నేతలు ఆరోపించారు. పీహెచ్​డీ ప్రవేశాల్లో అక్రమాలు, విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ బుధవారం కేయూ ఎస్​డీఎల్​సీఈ వద్ద ఎమ్మెల్సీ పల్లా దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. స్టూడెంట్ జేఏసీ నేతలు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి.. పల్లా సన్నిహితుడైన వీసీ రమేశ్​పై ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదన్నారు.

పల్లాకు సన్నిహితుడు కావడం వల్లే ప్రొఫెసర్ గా పదేండ్ల అనుభవం కూడా లేని తాటికొండ రమేశ్​ను వీసీగా నియమించారన్నారు. ఇప్పటికైనా వీసీ రమేశ్, రిజిస్ట్రార్ శ్రీనివాసరావును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించి వర్సిటీని కాపాడకపోతే వారి భరతం పడతామని హెచ్చరించారు. స్టూడెంట్ జేఏసీ లీడర్లు మాచర్ల రాంబాబు, అంబాల కిరణ్, ఆరెగంటి నాగరాజు, అంకిల్ల శంకర్ , వలీ ఉల్లాఖాద్రీ పాల్గొన్నారు.