తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన బస్సు ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన బస్సు ప్రమాదం

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం  ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత  అదుపు తప్పి రెయిలింగ్ ను ఢీ కొట్టి లోయవైపు దూసుకెళ్లింది. చెట్లు అడ్డుగా ఉండటంతో బస్సు రోడ్డు అంచుపైనే ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 10 మంది భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని తిరుపతిలోని రుయా హాస్పిటల్ కు తరలించారు.