ప్రైవేట్ బస్సు బోల్తా.. ఒకరి పరిస్థితి విషమం

ప్రైవేట్ బస్సు బోల్తా.. ఒకరి పరిస్థితి విషమం

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోమటికుంటలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి గాయాలు కాగా, ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తిరుపతి నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితుల్లో హైదరాబాద్, కూకట్ పల్లికి చెందిన వాసులు ఉన్నట్టు సమాచారం. బస్సును అధిక వేగంతో నడపడం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.