V6 News

సింధు, లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌పైనే ఫోకస్‌‌‌‌‌‌‌‌

సింధు, లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌పైనే ఫోకస్‌‌‌‌‌‌‌‌

బాలి: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు బుధవారం మొదలయ్యే ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌లో  టైటిలే టార్గెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగనుంది. ఇండియా నుంచి ఈసారి అత్యధికంగా ఏడుగురు బరిలోకి దిగుతున్నా..  సింధుతోపాటు యంగ్‌‌‌‌‌‌‌‌ సెన్సేషన్‌‌‌‌‌‌‌‌ లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌పైనే ఫోకస్​ ఉంది. సింధుకు ఈసారి నార్మల్​ డ్రా ఎదురైంది. గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో ఉన్న హైదరాబాదీ.. టాప్‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌ పొర్న్‌‌‌‌‌‌‌‌పవీ చొచువాంగ్‌‌‌‌‌‌‌‌(థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌)తో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌తో తన పోరాటాన్ని స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేయనుంది.  మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు కెంటా మొమోటా(జపాన్‌‌‌‌‌‌‌‌), విక్టర్‌‌‌‌‌‌‌‌ అక్సెల్సెన్‌‌‌‌‌‌‌‌(డెన్మార్క్‌‌‌‌‌‌‌‌), రాస్మస్‌‌‌‌‌‌‌‌ గెమ్కే(డెన్మార్క్‌‌‌‌‌‌‌‌)తో కలిసి లక్ష్యసేన్ కష్టమైన ​ గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో ఉన్నాడు. కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో ఉన్నాడు. తన స్థాయికి తగ్గట్టు ఆడితే గ్రూప్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌ను దాటగలడు.  మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో సాత్విక్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌కు టఫ్‌‌‌‌‌‌‌‌ డ్రానే ఎదురైంది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి లో ఉన్న అశ్విని–సిక్కి జంటకు ఓ మాదిరి డ్రా ఎదురైనప్పటికీ వారి ఫామ్‌‌‌‌‌‌‌‌ కాస్త కలవరపెడుతోంది.  గ్రూప్‌‌‌‌‌‌‌‌ దశలో  ఓ ప్లేయర్‌‌‌‌‌‌‌‌/జోడీ.. తన గ్రూప్‌‌‌‌‌‌‌‌లోని మిగతా ముగ్గురితో పోటీ పడుతారు. రెండు గ్రూప్స్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌2లో నిలిచిన వాళ్లు సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అవుతారు.