ఒలింపిక్స్ విజేతలకు బైజుస్ నగదు పురస్కారాలు

ఒలింపిక్స్ విజేతలకు బైజుస్ నగదు పురస్కారాలు
  • నీరజ్ చోప్రాకు రూ.2 కోట్ల నగదు
  • మిగిలిన వారికి రూ.కోటి చొప్పున నగదు బహుమతులు

న్యూఢిల్లీ: ఒలింపిక్స్.. పతకాల విజేతలకు భారతదేశమంతా బ్రహ్మరథం పడుతున్న నేపధ్యంలో ప్రముఖ సంస్థలు, ప్రముఖులు పతకాల వీరులకు తమవంతు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ఇదే కోవలోనే ప్రముఖ ఎడ్యుటెక్ స్టార్టప్ సంస్థ బైజుస్ భారీ నగదు పురస్కారాలు ప్రకటించింది. జావెలిన్ త్రో అంశంలో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకు రూ.2 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించగా.. రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి కోటి రూపాయల చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. భావి పౌరులను అత్యుత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్ది.. మంచి సమాజం..  జాతి నిర్మాణానికి క్రీడలు దోహదం చేస్తాయని బైజుస్ వ్యవస్థాపకుడు, సీఈఓ బైజు రవీంద్రన్ తెలిపారు.