పద్మారావునగర్, వెలుగు: ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘హెల్మెట్ ఆన్, వర్రీస్ గాన్’ నినాదంతో సంగీత్ చౌరస్తా కార్నర్ వద్ద భారీ హెల్మెట్ శిల్పాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ బి.సుమతి ముఖ్య అతిథులుగా హాజరై శిల్పాన్ని ఆవిష్కరించారు.
