ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

హుజూర్ నగర్, వెలుగు : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ లో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రచార జాతను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.