శంషాబాద్లో ఎయిర్ ఇండియా విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్లో ఎయిర్ ఇండియా విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా తన విమాన సర్వీస్ లను రద్దు చేసింది. ఈ విషయం తెలియక ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు నిర్వహించే విమానాల్లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ కారణాలతో విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. 

ఈ సమాచారాన్ని ప్రయాణికులకు చేరవేయడంలో ఎయిర్ ఇండియా విఫలం అయింది. దాంతో సోమవారం నాడు ఎయిర్ ఇండియాలో టికెట్ బుక్ చేసుకున్న 40 మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. తాము వెళ్లాల్సిన విమానం వివరాలు ఎంతకూ తెలియకపోవడంతో.. సంబంధిత అధికారులను నిలదీశారు. 

దాంతో హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, తిరుపతి, మైసూర్, విశాఖపట్నం వెళ్లాల్సిన విమానాలను.. తిరుపతి, చెన్నై, మైసూర్, బెంగళూరు నుంచి హైదరాబాద్ కు రావాల్సిన విమానాలను రద్దుచేసినట్లు అధికారులు ప్రకటించారు. ముందగా తమకు సమాచారం అందించకుండా సమయం వృధా చేసినందుకు సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దాంతో డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పడంతో వాళ్లు అక్కడినుంచి వెళ్లిపోయారు.