250 రన్స్‌‌ ఛేజింగ్‌‌లో హైదరాబాద్‌‌ 228/9

250  రన్స్‌‌ ఛేజింగ్‌‌లో  హైదరాబాద్‌‌ 228/9

హైదరాబాద్‌‌, వెలుగు: రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌‌కు మరో ఓటమి తప్పించేందుకు కెప్టెన్‌‌ తన్మయ్‌‌ అగర్వాల్‌‌ (123 బ్యాటింగ్‌‌) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఉప్పల్‌‌ స్టేడియంలో జరుగుతున్న గ్రూప్‌‌–బి మ్యాచ్‌‌లో అస్సాం ఇచ్చిన 250 రన్స్‌‌ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఆతిథ్య జట్టు మూడో రోజు, గురువారం చివరకు 228/9 స్కోరుతో నిలిచింది. హైదరాబాద్‌‌ విజయానికి చివరి రోజు మరో 22 రన్స్‌‌ అవసరం అవగా.. చేతిలో ఒకే వికెట్‌‌ ఉంది.

అంతకుముందు ఓవర్‌‌నైట్‌‌ స్కోరు182/6 తో ఆట కొనసాగించిన అస్సాం రెండో ఇన్నింగ్స్‌‌లో 252 రన్స్‌‌ వద్ద ఆలౌటైంది. ఆకాశ్‌‌ (31), సిద్దార్థ్‌‌ (36 నాటౌట్‌‌) రాణించారు. హోమ్‌‌టీమ్‌‌ బౌలర్లలో రవితేజ 5, కార్తికేయ, భగత్‌‌ వర్మ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌‌లో హైదరాబాద్‌‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌‌గా వ చ్చిన తన్మయ్‌‌కు భవేశ్‌‌ (41), రోహిత్‌‌ (20) కాసేపు సపోర్ట్‌‌ చేసినా మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. రియాన్‌‌ పరాగ్‌‌ 3 వికెట్లు తీశాడు.  ప్రస్తుతం తన్మయ్‌‌కి తోడుగా చివరి బ్యాటర్‌‌ కార్తికేయ (1 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నాడు.