డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొన్న కారు

డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొన్న కారు

రాజేంద్రనగర్: హైదరాబాద్ నగర శివార్లలో ఓ కారు నడిరోడ్డుపై  బీభత్సం సృష్టించింది. నార్సింగి చౌరస్తాలో డీ వైడర్ మద్యలో వున్న విద్యుత్ స్తంభాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళన కరంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. నిద్రమత్తుతో పాటు సెల్ పోన్ డ్రైవింగే ఈ ప్రమాదానికి కారణమంటున్నారు. కారు లో ఇంకెవ్వరూ  లేకపోవడంతో పేను ప్రమాదం తప్పిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.