మెహిదీపట్నం, వెలుగు: పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వేపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. షాద్నగర్కు చెందిన మీర్జా జుబేర్ బేగ్ (26) సోమవారం సాయంత్రం తన కారులో బంజారాహిల్స్లోని సోదరుడి ఇంటికి బయలుదేరారు.
పీవీ ఎక్స్ప్రెస్వే నుంచి వెళ్తుండగా మెహదీపట్నం వద్ద కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, జుబేర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం కారణంగా ఎక్స్ప్రెస్వేపై దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి క్రేన్ సహాయంతో వాహనాన్ని తొలగించి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. జుబేర్ ఉపవాసం ఉండటంతో ఒక్కసారిగా కళ్లు తిరిగినట్లు అనిపించి, సడన్బ్రేక్ వేయడంతో కారు పల్టీ కొట్టిందని మెహదీపట్నం సీఐ మల్లేశ్ తెలిపారు.
