V6 News

రెయిలింగ్ను ఢీకొట్టిన కారు..మామ మృతి.. మేనల్లుడికి గాయాలు..మల్లంపేట్ రింగ్ రోడ్డుపై ఘటన

రెయిలింగ్ను ఢీకొట్టిన కారు..మామ మృతి.. మేనల్లుడికి గాయాలు..మల్లంపేట్ రింగ్ రోడ్డుపై ఘటన

జీడిమెట్ల, వెలుగు:  తన మేనల్లుడిని కారులో తిప్పడానికి తీసుకెళ్లిన ఆ యువ సాప్ట్​వేర్ ఇంజినీర్ యాక్సిడెంట్​లో మృతి చెందాడు. నిజాంపేట్​కు చెందిన సాయితేజ్ (28) మంగళవారం తన 8 ఏండ్ల మేనల్లుడు రుషిరాజ్​ను తీసుకుని కారులో మేడ్చల్ వరకు వెళ్లాడు. 

తిరిగి వస్తుండగా మల్లంపేట్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 4ఏ వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్​ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి రెయిలింగ్ ఇనుప కడ్డీ కారు అద్దాన్ని చీల్చుకుంటూ సాయితేజ్ శరీరంలోకి చొచ్చుకుపోగా, అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న బాలుడు రుషిరాజ్ గాయాలతో బయటపడగా, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.