శంషాబాద్ ఎయిర్ పోర్టులో చార్జింగ్ పాయింట్ వద్దకు చేరుకున్న ఎలక్ట్రిక్ కారులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలంలోనే ఉన్న ఎయిర్ పోర్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేశారు.
కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఎవ్వరూ ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.