ఖమ్మం వెళ్లి అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్పై తప్పు వార్త రాశారని ఓ జర్నలిస్ట్ను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఈ-పేపర్లో “సీఎం కేసీఆర్కు కరోనా” ,”హరితహారం కార్యక్రమంలో సోకిందా” వార్త రెండు రోజుల క్రితం పబ్లిష్ అయింది. దాని పేపర్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై హైదరాబాద్ రహమత్ నగర్కి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మహ్మద్ ఇలియాస్ ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆదాబ్ హైదరాబాద్ జర్నలిస్ట్ వెంకటేశ్వరరావు, యాజమాన్యంపై ఐపీసీ 505(1)(బి), 505(2) రెడ్ విత్34 సెక్షన్లతో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 54 కింద కేసు నమోదు చేశారు. సోమవారం వెంకటేశ్వరరావు స్వస్థలం ఖమ్మం జిల్లాకు వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు.