మొక్కలు తొలగించిన వారిపై కేసు

మొక్కలు తొలగించిన వారిపై కేసు

నర్సింహులపేట(చిన్నగూడూరు),వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లిలో పల్లె ప్రకృతి వనం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను తొలగించిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ కుమార్ మంగళవారం తెలిపారు. ఉగ్గంపల్లి గ్రామంలో ఈ నెల 19న పల్లె ప్రకృతి వనంలో 2వేల మొక్కలను ఆఫీసర్లు, లీడర్లు నాటారు. గ్రామానికి చెందిన కొందరు రైతులు తమకు పూర్వం నుంచి ఉన్న భూమిలో మొక్కలు నాటారని సుమారు 1,500 మొక్కలు తొలగించారు. తహసీల్దార్ అరుణ బాయిని వివరణ కోరగా ప్రభుత్వ భూమిలోనే మొక్కలు నాటమన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..