32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు

32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు

జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ఆందోళన చేసిన 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై  కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం కార్పొరేటర్ల వెంట వచ్చిన కార్యకర్తలపై కూడా  కేసులు నమోదు చేస్తామన్నారు సైఫాబాద్ సిఐ సైది రెడ్డి. నిన్న(మంగళవారం)  జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కార్పొరేటర్లతోపాటు, కొంత  మంది బీజేపీ కార్యకర్తలు జీహెచ్ఎంసీ ఆఫీసులోకి చొచ్చుకెళ్లారు. కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలని.. జీహెచ్ఎంసీ నుంచి తమ కార్పొరేషన్లకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేయర్ హటావో అంటూ బల్దియా హెడ్ ఆఫీసులో బీజేపీ కార్యకర్తలు పోస్టర్లను అతికించారు. దీంతో ఇవాళ జీహెచ్ఎంసీ అధికారులు బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులకు  ఫిర్యాదు చేశారు.