షార్జా: ఐపీఎల్-13లో భాగంగా షార్జా వేదికగా సోమవారం కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసింది. ఆరోన్ ఫించ్, డివిలియర్స్ హాఫ్ సెంచరీలు చేయగా.. విరాట్(35) ఆచితూచి ఆడుతూ రాణించాడు.15 ఓవర్ల తర్వాత ఏబీ డివిలియర్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేస్తున్నాడు. ఆర్సీబీ రన్రేట్ను పెంచుకుంటూ పోయాడు. బౌలర్లు ఓవర్ ద వికెట్, రౌండ్ ద వికెట్ వేసినా అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఏబీడీ లాస్ట్ వరకూ క్రీజ్లో ఉండటంతో ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
కోల్ కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ , ప్రసిధ్ క్రిష్ణ చెరో వికెట్ తీశారు.
Innings Break!
AB de Villiers puts up a show here in Sharjah with a knock of 73* off 33.#RCB post a formidable total of 194/2 on the board. Will #KKR chase this down?#Dream11IPL pic.twitter.com/v5b3ZDizrM
— IndianPremierLeague (@IPL) October 12, 2020