హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల దందాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖలో రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేట్ వైద్య కళాశాలలు సీట్లను బ్లాక్ చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నాయని ఆరోపించారు. వైద్య సీట్ల దందాలో మంత్రులు కూడా భాగస్వామ్యం కావడం దారుణమన్నారు. మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి సీట్ల దందాకు పాల్పడుతున్నట్లు విద్యార్ధులు ఆరోపిస్తున్నారని ఆయన వెల్లడించారు. నీట్ ర్యాంక్ ఆధారంగా చిన్న చిన్న లొసుగులను ఆసరా చేసుకుని వందల కోట్లలో వ్యాపారం నడిపిస్తున్నారని తెలిపారు. కన్వీనర్ కోటాలో మెరిట్ ఆధారంగా పేద, మధ్య తరగతి విద్యార్ధులకు రావాల్సిన సీట్లను మేనేజ్ మెంట్ కోటాలోకి మార్చి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ బ్లాక్ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. వైద్య సీట్ల దందాపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్ను కోరారు.
మరిన్ని వార్తల కోసం...