నీట్ పేపర్ లీక్ కేసులో.. 13మంది నిందితులతో CBI ఫస్ట్ ఛార్జ్‌షీట్

నీట్ పేపర్ లీక్ కేసులో.. 13మంది నిందితులతో CBI ఫస్ట్ ఛార్జ్‌షీట్

నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సిబిఐ తన ఫస్ట్ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఆగస్టు 1న దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌లో 13 మంది నిందితులు ఉన్నారని తెలిపింది. చార్జిషీట్ లో పేపర్ లీక్ ఎలా చేశారని వివరాలు వెల్లడించారు. నితీష్‌ కుమార్‌, అమిత్‌ ఆనంద్‌, సికిందర్‌ యాద్వెందు తదితరులతో సహా 13 మంది వ్యక్తులను ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. వారిపై ఇండియన్ పీనల్ కోడ్ లోని 120-B, 201,409,380,411, 420 వంటి పలు సెక్షన్లు కేసు నమోదు చేశారు.

పాట్నాలోని శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు ఫస్ట్ 2024 మే 5న ఫైల్ చేశారు. తర్వాత జూన్ 23న సీబీఐకి బదిలీ చేయబడింది. CBI ఈ కేసులో టెక్నాలజీ, సీసీటీవీ పుటేజ్ లను ఉపయోగించి ఆధారాలను సేకరించింది.