ముగిసిన కస్టడీ.. రూస్ అవెన్యూ కోర్టుకు అభిషేక్ బోయిన్పల్లి

ముగిసిన కస్టడీ.. రూస్ అవెన్యూ కోర్టుకు అభిషేక్ బోయిన్పల్లి

లిక్కర్ స్కాంలో అభిషేక్ బోయిన్పల్లి  మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగిసింది. ఈ నేపధ్యంలో అధికారులు ఆయనను రూస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అభిషేక్ సీబీఐ కస్టడీని మరికొన్ని రోజుల పాటు పొడగించాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. మూడు రోజుల కస్టడీలో అభిషేక్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని, మరికొన్ని ఆధారాలు, పత్రాలు పరిశీలించాల్సి ఉందని కోర్టుకు విన్నవించరాు. అందుకే ఆయన కస్టడీ మరో రెండు రోజులు పొడగించాలని అధికారులు కోర్టును అభ్యర్థించారు.

మరోవైపు అరుణ్ పిళ్లైతో అభిషేక్కు సంబంధాలున్నాయని, వీరిద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయని సీబీఐ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. విచారణకు హాజరుకావాలని అరుణ్ పిళ్లైకు నోటీసులు ఇచ్చామని, అయితే ఆయన కూతురు హాస్పిటల్ లో అడ్మిట్ అయినందున విచారణకు హాజరుకాలేదని చెప్పారు. ఇదే కేసుకు సంబంధించి ముత్తా గౌతమ్ ను సైతం ప్రశ్నిస్తున్నట్లు సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉంటే అభిషేక్ తరఫు న్యాయవాది మాత్రం కస్టడీ పొడగించాల్సిన అవసరం లేదని ధర్మాసనానికి విన్నవించారు. రెండ్రోలుగా సీబీఐ అధికారులు ఎలాంటి విచారణ జరపనందున కస్టడీ పొడగించవద్దని కోరారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ అభిషేక్ బోయిన్పల్లిని సోమవారం హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఢిల్లీకి తరలించారు. అదే రోజు కోర్టు ఎదుట హాజరుపరచారు. ఇండోస్పిరిట్ ఖాతా నుంచి అభిషేక్ అకౌంట్ లోకి రూ.3.85కోట్లు వచ్చినట్లు గుర్తించామని సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. ఆ నగదు బదిలీకి సంబంధించి ఆయన ఎలాంటి పత్రాలు చూపలేదని చెప్పింది. రెండు మూడు ఖాతాల నుంచి వచ్చిన డబ్బును అభిషేక్ వివిధ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టాడని, ఆయనకు ఆ కంపెనీల్లో షేర్లు ఉన్నాయని విన్నవించింది. లిక్కర్ పాలసీ విషయంలోనూ అభిషేక్ వివిధ ప్రాంతాల్లో జరిగిన మీటింగ్ లకు హాజరైన విషయాన్ని సీబీఐ ప్రస్తావించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అభిషేక్ ను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించాలని కోరింది. సీబీఐ వాదనలు విన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్ కే నాగ్ పాల్ ఆయనను అక్టోబర్ 12 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.