12 ఏళ్ల తర్వాత..ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం

12 ఏళ్ల తర్వాత..ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఆయేషా మీరా హత్య కేసు విచారణ కీలక మలుపు తిరగబోతోంది. 12 ఏళ్ల తర్వాత ఆమె మృతదేహానికి సీబీఐ రీపోస్టుమార్టం నిర్వహించబోతోంది. తమకు కూడా సీబీఐ డీఎన్ఏ టెస్టులను నిర్వహించిందని ఆయేషా తల్లిదండ్రులు చెప్పారు చెప్పారు. ఆయేషాకు డీఎన్ఏ టెస్టు చేయడానికి మత పెద్దలు ఒప్పుకోలేదని… అయితే, కోర్టు ద్వారా సీబీఐ అనుమతులు తెచ్చుకుందని తెలిపారు. పోలీసులు, కోర్టులు, రాజకీయ నాయకులపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తామని చెప్పారు. తమకు సీబీఐ కూడా న్యాయం చేయకపోతే… ప్రజలు ఏ వ్యవస్థను నమ్మరన్నారు.