కాజీపేట,వెలుగు: నేరాల అదుపునకు సౌత్ సెంట్రల్ జోన్ పరిధిలోని 700 రైల్వే స్టేషన్లలో,170 కోట్ల రుపాయలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఈశ్వర్ రావు తెలిపారు. గురువారం వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని ఆర్పీఎఫ్ పోలీసు స్టేషన్ లో ఆర్పీఎఫ్ అధికారులతో సంవత్సరపు తనిఖీ సమావేశాన్ని నిర్వహించారు.
సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని రైల్వే ఆస్తుల పరిరక్షణకు, రైళ్లలో తనిఖీలకు 810 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది కొత్తగా రిక్రూట్ అయ్యారన్నారు. ట్రైన్లలో న్యూ సెన్స్ కలిగిస్తే హిజ్రాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇబ్బందులు తలెత్తితే ప్రయాణికులు ఆర్పీఎఫ్ హెల్ప్ లైన్ 182 నెంబర్ కు ఫోన్చేయాలన్నారు.