న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ మొబైల్ డివైసెస్లో గుత్తాధిపత్యానికి పాల్పడుతోందనే ఆరోపణల మీద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గూగుల్పై రూ. 1,338 కోట్ల ఫైన్ విధించింది. ఈ ఓపెన్సోర్స్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ను స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు తయారు చేసే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్లు (ఓఈఎం) ఇన్స్టాల్ చేస్తున్నారు. వ్యాపారంలో అక్రమాలకు పాల్పడవద్దంటూ గూగుల్కు హెచ్చరికలను కూడా సీసీఐ జారీ చేసింది.
ఇచ్చిన గడువులోగా ఈ కంపెనీ పద్ధతులు మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అన్–ఇన్స్టాల్ చేయడానికి వీలు కాని రీతిలో గూగుల్ మొబైల్ సూట్ (జీఎంఎస్)ను ముందుగానే డివైస్లలో ఇన్స్టాల్ చేసి ఇవ్వడం పట్ల సీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.