బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

 సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాము 11 మంది కలిసి క్రికెట్ జట్టుగా ఏర్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సూర్యా పేట జిల్లా మోతె మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ మతాన్ని అడ్డుపె ట్టుకుని విద్వేషాలను సృష్టిస్తుందన్నారు. 

ఆ పార్టీకి మరో అవకాశం ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పదేండ్లుగా బీజేపీ ప్రచారానికే పరిమితం అయ్యిందని, చేసిందేమీ లేదని విమ ర్శించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని మంత్రి ఉత్తమ్ జోస్యం చెప్పారు.