ఏనుమాముల మార్కెట్‌లో .. సీసీఐ పత్తి కొనుగోళ్లు షురూ

ఏనుమాముల మార్కెట్‌లో ..  సీసీఐ పత్తి కొనుగోళ్లు షురూ

కాశీబుగ్గ, వెలుగు : వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో కాటన్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లను బుధవారం వరంగల్​ జిల్లా కలెక్టర్​ ప్రావీణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ మార్కెట్లోకి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీసీఐ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు.

అందు కోసం మార్కెట్ లోని సీసీఐ, మార్కెట్  కమిటీ ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీఐ డిప్యూటీ జనరల్​ మేనేజర్​ శ్రీవేద, అసిస్టెంట్ మేనేజర్​ సచిన్​ షిండే, వ్యాపారులు, రైతులు పాల్గొన్నారు.