కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లను బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్లోకి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీసీఐ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు.
అందు కోసం మార్కెట్ లోని సీసీఐ, మార్కెట్ కమిటీ ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీవేద, అసిస్టెంట్ మేనేజర్ సచిన్ షిండే, వ్యాపారులు, రైతులు పాల్గొన్నారు.