ఛోక్సీ కేసులో రంగంలోకి కేంద్రం

ఛోక్సీ కేసులో రంగంలోకి కేంద్రం


న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్​బీ) స్కాం నిందితుడు మెహుల్ ఛోక్సీ కేసులో కేంద్రం న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఛోక్సీని తిరిగి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందు లో భాగంగా డొమినికా హైకోర్టు విచారణలో కేంద్రం,సీబీఐ ఇంప్లీడ్​ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పీఎన్​బీ స్కాంకు సంబంధించి సీబీఐ, పౌరసత్వాని కి సంబంధించి  విదేశాంగ శాఖ వాదనలు వినిపించనున్నట్లు సమా చారం. ఛోక్సీ హెబీయస్ కార్పస్ అభ్యర్థనపై సీబీఐ డొమినికా కోర్టు లో ‘ఇంప్లీడ్​మెంట్’ అప్లికేషన్ దాఖ లు చేసింది. పీఎన్​బీ స్కాం కేసు వివరాలను కోర్టు ముందుంచాలని సీబీఐ ప్రయత్నిస్తోంది. ఇక విదేశాంగ శాఖ మరో పిటిషన్​ను డొమినికా హైకోర్టులో దాఖలు చేసింది. ఛోక్సీ ఇంకా ఇండియనే అని.. అతడి పాస్​పోర్టు సమర్పిం చలేదని అందులో పేర్కొంది. ఈ పిటిషన్​ను డొమినికా హైకోర్టు ఆమోదిస్తే.. మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్​సాల్వే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తారు.