టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కేంద్ర హోంశాఖ నోటీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కేంద్ర హోంశాఖ నోటీసులు

ద్వంద్వ పౌరసత్వం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ లకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ ఆ ఇద్దరికీ స్పష్టం చేసింది. చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కలిగివున్నారంటూ ఆది శ్రీనివాస్ గతంలో ఫిర్యాదు చేశారు. చెన్నమనేనికి జర్మనీ సిటీజన్ షిప్ కూడా ఉంది. ఇప్పుడు దీనిపైనే హోంశాఖ నోటీసులు పంపింది. ఈ క్రమంలో చెన్నమనేని రమేశ్ అక్టోబరు 31న కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి తన వివరణ తెలియజేయనున్నారు.