క్రెడిట్ సొసైటీ స్కామ్ లో ఆయనపై దర్యాప్తుకు సిటీ కోర్టు ఆదేశం
జైపూర్: కేంద్రమంతి గజేంద్ర సింగ్ షెకావత్ చిక్కుల్లో పడ్డారు. క్రెడిట్ సొసైటీ స్కామ్ కు సంబంధించి మంత్రిపై వచ్చిన కంప్లైంట్ ను విచారించాలని జైపూర్ సిటీ కోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. సంజీవని క్రెడిట్ సొసైటీ పేరుతో దాదాపు రూ. 900 కోట్ల స్కామ్ కు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్ లో మినిస్టర్ గజేంద్ర సింగ్ పాత్ర కూడా ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కేసు విచారిస్తున్న స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ గతేడాదే ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఇందులో మంత్రి పేరు లేకపోవటంతో బాధితులు అప్పుడే మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. మంత్రి పాత్రపై దర్యాప్తు చేయాలని కోరగా కోర్టు అనుమతించలేదు. దీంతో బాధితులు జైపూర్ సిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
For More News..