కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల తెలిసిందే చెప్పారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల తెలిసిందే చెప్పారు:  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ తనకు తెలిసిందే చెప్పారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కమిషన్ ముందు, బయట ఈటల ఒకటే చెప్పారని.. కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలని ఈటెల చెప్పినట్లు తెలిపారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యే ల పై చర్యలు తీసుకుంటామని చెప్పారని.. కానీ ఎవరిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ క్రాక్ అయింది నిజం కాదా.. NDSA రిపోర్ట్ తప్పు ఏవిధంగా అవుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరం పై CBI దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. 

గత ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని రాహుల్ గాంధీ అనటం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ వీఎంల ట్యాంపరింగ్ జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా చిట్ చాట్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు  కిషన్ రెడ్డి. 

ఎన్డీఏ 11 ఏళ్ల పాలన పై కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని..దానిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ సారి అసంబ్లీపై ఎగిరేది కాశాయ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. 

సోషల్ మీడియా వర్క్ షాప్ లో మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతుల్లో వందల మంది చనిపోతే కాంగ్రెస్ ఏనాడు స్పందించలేదని.. కానీ ఇప్పుడు ఈ అంశంపై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. పాక్ మన  సైనికులని చంపితే.. ఉగ్రవాద స్థావరాలని సర్జికల్ స్ట్రైక్ పేరుతో ధ్వంసం చేశామని.. అదే విధంగా పహల్గాం లో ఉగ్రవాదులు టూరిస్ట్ లని చంపితే.. సింధూర్ పేరుతో దాడులు చేశామని చెప్పారు. రాహుల్ గాంధీ దమ్ముంటే తమను విమర్శించాలని, సైనికులని కాదని అన్నారు. 

బీజేపీ సోషల్ మీడియా అసలైన వార్ చేస్తుంది:

బీజేపీ సోషల్ మీడియా పనితీరు బాగున్నట్లు చెప్పిన కిషన్ రెడ్డి.. సోషల్ మీడియా  అసలైన వార్ చేస్తుందని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే.. బీజేపీ రావాలని, తెలంగాణ ను రక్షించే పార్టీ బీజేపీయేనని ఈ సందర్భంగా అన్నారు. 

కాంగ్రెస్, బిఆర్ ఎస్ పార్టీలు ప్రజలకి ఇచ్చినా హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు కిషన్ రెడ్డి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అసెంబ్లీ పై ఎగిరేది కాషాయ జెండా యేనని ధీమా వ్యక్తం చేశారు.