కేంద్ర పథకాలను జనాల్లోకి తీసుకెళ్లాలి : ఎంపీ లక్ష్మణ్

కేంద్ర పథకాలను  జనాల్లోకి తీసుకెళ్లాలి :  ఎంపీ లక్ష్మణ్

ఘట్​కేసర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ కార్యకర్తలకు సూచించారు. బుధవారం ఘట్​కేసర్ మండలంలో జరిగిన బీజేపీ ఆఫీసు ప్రారంభోత్సవానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగాలక్ష్మణ్ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం సీఎం కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడం కంటే ముందుగా ప్రగతిభవన్ దగ్గర చేయాలన్నారు.  కేసీఆర్ విడుదల చేసిన ఎమ్మెల్యేల లిస్టులో మహిళలు, బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. 

దళిత బంధు పంపిణీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలే 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత కొంపల్లి మోహన్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.