
- డిపాజిట్ గడువు జూన్ 30 వరకు పొడిగింపు
న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) ఇన్వెస్టర్లకు భారీ ఊరట లభించింది. ఈ స్కీముల కింద డబ్బులు డిపాజిట్ చేసేందుకు గడువును పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2019 – 20 ఆర్థిక సంవత్సరానికి గాను జూన్ 30 వరకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కీం కింద ఉండేవారు ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 లోగా మినిమమ్ బ్యాలెన్స్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చేయకపోతే ఫైన్ కట్టాల్సి ఉంటుంది.