- ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారీదారులను కోరిన కేంద్రం
చెన్నై : ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారీదారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేటప్పుడు దేశ భద్రతా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ శనివారం అన్నారు. "మేము దీని గురించి గతంలోనూ మాట్లాడాం. సైబర్ భద్రత మరింత ముఖ్యమైనదిగా మారుతోంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు చాలా జాగ్రత్తగా ఉండాలి”అని ఆయన పేర్కొన్నారు.
శనివారం ఇక్కడ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సదరన్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (సిక్కీ) నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. సైబర్ సెక్యూరిటీ జాతీయస్థాయిలోనూ కీలకంగా మారిందని చెప్పారు.