చైన్ స్నాచర్ అరెస్ట్.. 36 గ్రాముల గోల్డ్ స్వాధీనం

చైన్ స్నాచర్ అరెస్ట్.. 36 గ్రాముల గోల్డ్ స్వాధీనం

చందానగర్, వెలుగు: వారం రోజుల కిందట చైన్ స్నాచింగ్​కు పాల్పడ్డ వ్యక్తిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్​చెరుకి చెందిన లోకమ్మ ఈ నెల13న ఉదయం 10.30 గంటలకు లింగంపల్లి రైతుబజార్ ముందు పండ్లు అమ్ముతోంది. రమేశ్ అనే వ్యక్తి అక్కడిక వచ్చి లోకమ్మ మెడలోని పుస్తెల తాడును తెంపుకుని పరారయ్యాడు.

బాధితురాలి కంప్లయింట్ మేరకు చందానగర్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం పటాన్ చెరు లేబర్ అడ్డా వద్ద రమేశ్​ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గరి నుంచి 36 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.