- నిందితుడు జగిత్యాలలో అరెస్ట్
చందానగర్, వెలుగు: అప్పులు తీర్చేందుకు ఓ యువకుడు చైన్ స్నాచర్గా మారాడు. నిమిషాల వ్యవధిలో ఇద్దరు వృద్ధరాళ్ల మెడలోని పుస్తెల తాడు, గోల్డ్చైన్లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్శివారులోని చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరగగా.. నిందితుడిని పోలీసులు అరెస్ట్చేశారు. చందానగర్ ఠాణాలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్కుమార్వివరాలు వెల్లడించారు.
లింగంపల్లి ఓల్డ్ ఎంఐజీలో నివాసం ఉండే పొట్లపల్లి సత్యవతి జనవరి 31న ఉదయం కిలోమీటర్దూరంలో ఉన్న రామాలయానికి వెళ్లింది. పూజ అనంతరం తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని పుస్తెలతాడు, నల్లపూసల దండ లాక్కొని పారిపోయాడు. తర్వాత 5 నిమిషాల్లోనే పక్క రోడ్డులో ఆలయం నుంచి ఇంటికి వెళ్తున్న చాగంటిపాటి జయభారతి మెడలోని గోల్డ్చైన్ను చోరీ చేశాడు.
బాధితురాళ్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని శేరిలింగంపల్లి గోపినగర్కు చెందిన రాజేశ్గా గుర్తించి, అరెస్ట్ చేశారు. అప్పుల బాధ నుంచి బయటపడేందుకు చైన్స్నాచింగ్కు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ చెప్పారు. చోరీ తర్వాత రాజేశ్కరీనంగర్, అక్కడి నుంచి జగిత్యాలకు పారిపోయినట్లు గుర్తించి, జగిత్యాలలో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 8 తులాల బంగారం రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. డీఐ భాస్కర్, ఎస్వోటీ ఇన్స్పెక్టర్రాజశేఖర్ఉన్నారు.
