ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగింది. తన పర్యటనలోఅకాల వర్షాలకు పంటనష్టం జరిగిన ప్రాంతాలనుపరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ రోజు ( మే6) ఉదయం చాగల్లు మండలంలోని ఐ పంగిడి ,చాగల్లు, ఊనగట్ల, బ్రాహ్మణగూడెం ప్రాంతాల్లో పర్యటించి.. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు.
అనంతరం కొద్దిసేపు విరామం తీసుకుని మళ్ళీ తిరిగి తన పర్యటనను ప్రారభించారు చంద్రబాబు. నిడదవోలు మండలం కంసాలిపాలెం, తీరిగూడెం, సింగవరం ప్రాంతాల్లో పర్యటించి.. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు.
తాను పర్యటన చేస్తున్న తర్వాతనే ప్రభుత్వం నుంచి స్పందన మొదలైందన్నారు చంద్రబాబు. అకాల వర్షాలతో అన్నదాతలు కష్టాల్లో ఉంటే సీఎం జగన్ బాధితులను పరామర్శించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతుల పంటలకు బీమా చేయించలేదని.. ప్రీమియం చెల్లించలేదని చంద్రబాబు ఆరోపించారు.