కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు

కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు

రెండున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా అవమానిస్తోందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. అన్నీ భరించాం.. అయినా కూడా అవమానిస్తునే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను సీఎంగా ఉన్నకాలంలో ప్రతిపక్షనేతలను ఎన్నడూ అవమానించలేదని ఆయన అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని చంద్రబాబు అన్నారు.

‘నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవమానాలకు గురి చేస్తూనే ఉన్నారు. పార్టీ కార్యకర్తలను హింసించేవారు.. బూతులు తిట్టారు.. అయినా భరించాం. బీఏసీలో అచ్చెన్నాయుడుతో వ్యంగ్యంగా సీఎం జగన్ మాట్లాడారు. అన్నీ భరించి అసెంబ్లీకి వెళ్తే.. నా భార్యను రాజకీయాల్లోకి లాగుతున్నారు. నా భార్య వ్యక్తిత్వ హననానికి వైసీపీ పాల్పడుతోంది. ప్రతిపక్షంలో ఉండే వ్యక్తుల గురించి నా జీవితంలో ఎప్పుడూ తక్కువగా మాట్లాడలేదు. గౌరవంగానే వ్యవహరించాం. జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద నేతలతో పని చేశాం. ప్రజల కోసం రాజకీయం చేస్తున్నామని గర్వంగా ఫీలయ్యేవాళ్లం. ఈ రోజు ఘటనలను ఏ విధంగా అభివర్ణించాలో అర్ధం కావడం లేదు’ అని చంద్రబాబు అన్నారు.