
ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల లోపాలపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వెంట సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, యనమల, కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, మాగంటి బాబు, మురళీమోహన్, గంటా శ్రీనివాసరావు పలువురు నేతలు ఉన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయనున్నారు.