
అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అనుమానాస్పద మృతి వార్తలపై స్పందించిన ముఖ్యమంత్రి అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. డీజీపీతో, ఇంటలిజెన్స్ అధికారులతో, కడప జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు. వివేకానంద రెడ్డి మృతిపై అత్యన్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని.. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ను ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని, నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని సూచించారు.
వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు చంద్రబాబు. శాసన సభలో, శాసన మండలిలో, లోక్ సభలో ప్రజా ప్రతినిధిగా పనిచేయడాన్ని గుర్తుచేసుకున్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా దీర్ఘకాలం సేవలు అందించారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరారు.