యూరప్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు

యూరప్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు

ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి ఆయన ప్రత్యేక లేఖలో తెలిపారు.ఇవాళ ఢిల్లీలో జరగనున్న పార్టీల అధ్యక్షుల సమావేశానికి తాను హాజరు కాబోవడం లేదని, ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం, తాను విదేశాలకు వెళ్లాల్సి వుందని అన్నారు.

నిన్న(మంగళవారం) సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి,మనుమడు దేవాంశ్ ఇవాళ యూరప్ వెళ్లారు. యూరప్ పర్యటన ముగించుకుని ఈ నెల 26న తిరిగి ఇండియాకు రానున్నారు.