బీజేపీకి వ్యతిరేకంగా ఎవరొచ్చినా కలిసి పోతాం: చంద్రబాబు

బీజేపీకి వ్యతిరేకంగా ఎవరొచ్చినా కలిసి పోతాం: చంద్రబాబు

బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు కలిసి వచ్చినా కలుపుకుని వెళ్తామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చంద్రగిరిలో రీ పోలింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు సీఈసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఫిర్యాదు చేస్తే ఈసీ పట్టించుకోవడం లేదని .. వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తుందన్నారు. 25 రోజుల తర్వాత రీ పోలింగ్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఒక అధికారి రిపోర్టు ఇస్తే ఈసీ ఎలా నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరడాతమని అన్నారు. త్వరలోనే ప్రతిపక్షాల మీటింగ్ ఉంటుందన్నారు చంద్రబాబు.