శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం

శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం

కర్నూలు జిల్లా :  శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం రేపింది. శ్రీశైల దేవస్థానానికి 14 కిలో మీటర్ల  దూరంలో ఉన్న.. ఆంజనేయ స్వామి గుడి పరిసరాల్లో పులి కనిపించింది.  రాత్రి  ఘాట్ రోడ్డుకు  అడ్డంగా  కొంతసేపు నిలబడింది. భయంతో  వాహనాలు  నిలిపివేశారు భక్తులు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ జామైంది.

తర్వాత చిరుత అడవిలోకి వెళ్లిపోవడంతో… అరగంట తర్వాత వాహనాల రాకపోకలు కొనసాగాయి. శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ ఎత్తున వేడకలకు వస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు అలెర్టై ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా చూడాలంటున్నారు భక్తులు.

See Also: శ్రీశైలంలో ఘనంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు