చెన్నైలోని ఓ ఫార్మసీ ఉద్యోగి తన బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు జమ అయినట్లు అక్టోబర్ 7న గుర్తించారు. మహమ్మద్ ఇద్రీస్ అనే వ్యక్తి తన కోటక్ మహీంద్రా బ్యాంకు ఖాతా నుంచి శుక్రవారం (అక్టోబర్ 6) 2వేల రూపాయలను స్నేహితుడికి ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ తర్వాత, అతను తన ఖాతా బ్యాలెన్స్ని చేయగా.. తన బ్యాంక్ బ్యాలెన్స్ మెసేజ్లో రూ. 753 కోట్ల మొత్తం కనిపించి షాక్ కు గురయ్యాడు.
ఈ అసాధారణ సంఘటన గురించి ఆందోళన చెందిన ఇద్రిస్యయ బ్యాంక్కు సమస్యను నివేదించాడు. దీంతో వారు అతని ఖాతాను నిలిపివేశారు. తమిళనాడులో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి.
గతంలో చెన్నైకి చెందిన రాజ్కుమార్ అనే క్యాబ్ డ్రైవర్ తన తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఖాతాలో రూ.9వేల కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్యను లేవనెత్తిన తర్వాత, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ పరిస్థితిని సరిదిద్దింది. అనంతరం వారు అదనపు డబ్బును వెనక్కి తీసుకున్నారు. మరో ఘటనలో తంజావూరుకు చెందిన గణేశన్ అనే వ్యక్తి తన బ్యాంకు ఖాతాలో రూ. 756 కోట్లు ఉండడం చూసి కంగుతిన్నాడు.