బీజేపీ సర్పంచ్ల గ్రామాలకు రూ.10 లక్షలు : చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

బీజేపీ సర్పంచ్ల గ్రామాలకు రూ.10 లక్షలు : చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల పార్లమెంట్​ పరిధిలో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచుల గ్రామాలకు ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి ప్రకటించారు. చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీ సహకారంతో విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు బుధవారం చేవెళ్లలోని కేజీఆర్​ ఫంక్షన్​ హాల్​లో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి చీఫ్​ గెస్టుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కేంద్రమే నిధులు ఇస్తోందని, అందరూ ఐక్యంగా పనిచేసి ఉత్తమ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని సూచించారు.

 కాంగ్రెస్​  ప్రలోబాలకు గురికావొద్దని, 15వ ఫైనాన్స్​ కమిషన్ ​ నుంచి వచ్చే నిధులను ఎవరికీ ఆపే దమ్ములేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం చేవెళ్ల మండలం నాంచేరు సర్పంచ్​ ఆశోక్​ బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్​ రత్నం, సీనియర్​ నాయకులు అంజన్​ కుమార్​ గౌడ్​, కంజర్ల ప్రకాశ్, ప్రభాకర్​ రెడ్డి, పార్టీ మున్సిపల్​ అధ్యక్షుడు అత్తెల్లి అనంత రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీకాంత్​ తదితరులు పాల్గొన్నారు.