ఛత్తీస్ ఘడ్లో పోలీసుల పై మావోయిస్టుల దాడి

ఛత్తీస్ ఘడ్లో పోలీసుల పై మావోయిస్టుల దాడి

ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం పోలీస్ క్యాంప్ పై జనవరి 16 తేదీన మావోయిస్ట్ లు భారీ దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మావోయిస్టులు, కొంతమంది పోలీసులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వెయ్యి మంది మావోయిస్టులు పోలీసుల దగ్గరి నుంచి ఆయుధాలు ఎత్తుకెళ్లాలని పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేసినట్లు పేర్కొన్నారు. సుమారు వేయి రాకెట్ లాంచర్లతో దాడికి పాల్పడితే.. అందులో 3వందల రాకెట్ లాంచర్లు పేలలేదని వాటిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 

మొట్టమొదటిసారిగా మావోయిస్టులు తమ ఒంటిమీద అడివి గడ్డితో చేసిన దుస్తులు లాంటివి ధరించి గుర్తుపట్టలేని వేషధారణతో ఈ దాడికి పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఇటువంటి తరహా ఘటన ఇప్పటివరకు ఎక్కడ జరగలేదని చెప్పారు పోలీసులు.