కోడి యాంటీబాడీస్ తో కరోనా తీవ్రతకు చెక్

కోడి యాంటీబాడీస్ తో కరోనా తీవ్రతకు చెక్

కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వ్యాక్సిన్ తో పాటు టాబ్లెట్లు, నాజల్ డ్రాప్స్ లాంటివి రూపొందిస్తున్నారు. లేటెస్టుగా కోడితో కరోనాకు చికిత్స చేయొచ్చని ప్రకటించారు. కోడి నుంచి యాంటీబాడీస్ తీసుకుని కరోనా తీవ్రతను తగ్గించవచచ్చని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మనుషుల్లానే కోళ్లలోనూ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. కోడిగుడ్లలోని యాంటీబాడీలు కరోనా నుంచి కొంత కాలం రక్షణ కల్పిస్తాయని తాజా పరిశోధనలో పాల్గొన్న డేరియా మూచీ రోజెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. కోడిగుడ్ల నుంచి సేకరించిన యాంటీబాడీలను నాజల్ డ్రాప్స్ రూపంలో మార్చి కరోనా పేషంట్లకు ఇవ్వొచ్చన్నారు.

కోడిగుడ్లలోని పచ్చసొన నుంచి యాంటీబాడీలు సేకరించారు. వాటిని నోస్ డ్రాప్స్ రూపంలోకి మార్చి కరోనా రోగులపై ప్రయోగిస్తున్నారు. దీంతో రోగుల్లో కొంతకాలం రోగనిరోధక శక్తి పెరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఆస్పత్రులు, విమానాశ్రయాలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే సిబ్బంది ఈ డ్రాప్స్ వాడటంతో వారికి కరోనా సోకుండా అడ్డుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం 48 మంది పేషంట్లపై ప్రయోగాలు నిర్వహిస్తున్నామని, పూర్తి ఫలితాలు వచ్చాక మరిన్ని వివరాలు ప్రకటిస్తామన్నారు స్టాన్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగాలు విజయవంతమైతే అతి తక్కువ ధరలో కరోనా నిరోధక నాజల్ స్ప్రే అందుబాటులోకి వస్తుందంటున్నారు.