చిదంబరానికి బెయిల్.. దేశం విడిచి వెళ్ళరాదు

చిదంబరానికి బెయిల్.. దేశం విడిచి వెళ్ళరాదు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరానికి బెయిల్ మంజూరు అయింది. రూ. 2 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు పై ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సీబీఐ కేసులో ఇప్పటికే చిదంబరానికి బెయిల్ మంజూరు అయ్యింది. ఈ సందర్భంగా పర్మిషన్ లేకుండా దేశం విడిచి వెళ్లరాదని..సాక్షులను తారుమారు చేసే పనులు చేయవద్దని కోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించిన ఎటువంటి వ్యాఖ్యలనూ చేయరాదని షరతు విధించింది.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అక్టోబర్ 21న అరెస్టైన చిదంబరం..106 రోజులగా తీహార్ జైల్లోఉన్నారు. బెయిల్ మంజూరు కావడంతో సాయంత్రం జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశముంది.