ED కేసులో చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు

ED కేసులో చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు

INX మీడియా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED)కస్టడీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఇవాళ(బుధవారం) ఢిల్లీ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. చిదంబరం ఈ నెల 24వ తేదీ వరకూ ED కస్టడీలో ఉండనున్నారు. చిదంబరాన్ని ఇదే కేసులో సిబిఐ అరెస్టు చేసింది. తీహార్‌ జైలులో ఉన్న చిదంబరానికి సిబిఐ కేసులో నిన్న(మంగళవారం) బెయిల్‌ మంజూరైంది. ED కేసులో కస్టడీలో ఆయన విడుదల సాధ్యం కాలేదు. దీంతో బెయిల్ కోసం చిదంబరం హైకోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేశారు.